ప్రకాష్ రాజ్ ‘ఆగడు’ సినీమా యూనిట్ మధ్య జరిగిన వివాదం ఇప్పుడు తుఫాన్ గా మారి టాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ వివాదం ఒక కుటుంబ వివాదంలా సమసి పోతుందని అందరు అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని టాలీవుడ్ డైరెక్టర్స్ అసోసియేషన్ చాల సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఈ విషయం పై సభ్యుల అభిప్రాయలను సేకరించడమే కాకుండా ప్రకాష్ రాజ్ కు 75 లక్షల ఫైన్ ను విధించడమే కాకుండా ఆ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యత టాలీవుడ్ దర్శకుల సంఘం తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ సహకరించకపోతే అతని పై బ్యాన్ విధించే ఆలోచన కూడ టాలీవుడ్ దర్శకుల సంఘం అదేవిధంగా నిర్మాతల మండలి చేస్తోందని ఎపిహెరాల్డ్ కు అందుతున్న విశ్వసనీయ సంచారం. ప్రతిరోజు ‘ఆగడు’ సినిమా షూటింగ్ కు ఆలస్యంగా రావడమే కాకుండా ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్స్ పై అవమానకరంగా ప్రకాష్ రాజ్ మాట్లాడిన విషయాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ చాల సీరియస్ గా తీసుకుని ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది అని అంటున్నారు. విషయం చేయి జారిపోతున్న సందర్భాన్ని గుర్తించిన ప్రకాష్ రాజ్ తనకు సన్నిహితుడైన దిల్ రాజ్ ద్వారా రాజీ చర్చలు ప్రారంభించాడని టాలీవుడ్ న్యూస్. అయితే ఇంత వివాదం జరుగుతున్నా ఈ సినిమా హీరో ప్రిన్స్ మహేష్ ఇరువైపులా ఎటువంటి విషయం మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: