పవన్ కళ్యాణ్ భారతీయ జనత పార్టీ తెలుగు దేశం కూటమికి వోట్లు వేయండని జనాన్ని కోరుతూ ఉంటె పవన్ ప్రచారానికి వస్తే తమకు నష్టం కాబట్టి పవన్ ను ప్రచారానికి రాకుండా ఆపుచేయండని టీడీపి నేతలు చంద్రబాబు పై ఒత్తిడి చేయడం సంచలనంగా మారింది. నమ్మడానికి ఇది అవాస్తవంగా కనిపించినా ఇదినిజం. అయితే ఈ వార్త పవన్ గతంలో మోజుపడిన మల్కాజిగిరి నియోజక వర్గానికి చెందినది. దీనికి కారణం పవన్ రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీకి సపోర్టు ఇస్తూ మల్కాజ్ గిరిలో మాత్రం లోక్‌సత్తా వైపు ప్రచారం చేయబోతు ఉండటంతో అక్కడ నిలబడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్దులుకు సమస్య వచ్చి పడింది. తమకు ప్రచారం చేయకపోయినా ఫర్వాలేదు ఇక్కడకి వచ్చి వేరే పార్టీకి ప్రచారం చేయకుండా పవన్ ని ఆపాలని వారు చంద్రబాబును కోరుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే చంద్రబాబు పవన్ ల మధ్య చర్చలు జరిగినా పవన్ తన పెంకి పట్టుదల వీడటం లేదు అని అంటున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లారెడ్డి ఈ విషయమై చంద్రబాబుకు తన తీవ్ర అభ్యంతరాలను తెలియ చేసినట్లు టాక్. పవన్ మల్కాజ్ గిరిలో పోటీ చేయడం వల్ల లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ కు వచ్చే ప్రయోజనం కన్నా ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కు అనుకూలంగ పరిస్థితి మారుతుందని తెలుగుదేశం వర్గాల వాదన. మరి ఈ విషయంలో పవన్ ఇచ్చన మాట ఏమిచేస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: