నయతార ప్రధాన పాత్రలో నటించిన అనామిక మూవీ ఆడియో విడుదలకు టాలీవుడ్ లోని ప్రముఖలంతా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఈ మూవీకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఏమిటంటే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఓ మూవీను రిమేక్ చేస్తున్నాడు. హిందీలో సన్షేనల్ హిట్ సాధించిన కహాని మూవీకు ఇది తెలుగు రిమేక్ గా జరిగింది. నయనతార, హర్షవర్ధన్ రాణే, వైభవ్ లు ప్రధాన నటీనటులుగా అనామిక మూవీలో నటించారు. అలాగే వయాకమ్ 18- ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ సంస్థలు తొలిసారిగా దక్షిణాదిలో ప్రవేశించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు ఓ స్పెషల్ అయితే, అదే విధంగా శేఖర్ కమ్ముల తొలిసారిగా సిరివెన్నల సీతారామశాస్త్రి గారితో కలిసి పనిచేశారు. రీసెంట్ గా అనామిక మూవీ మీద రిలీజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్ కూడ భారీగా పబ్లిసిటిను పొందింది. ఈ ప్రమోషనల్ సాంగ్ లో సింగర్ సునీత మీద చేయటం వల్ల మూవీకు మరింత పబ్లిసిటి చేకూరింది. ఈ సినిమాను తెలుగు, తమిళ బాషల్లో మే 1న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో కాలం టైం ను కేటాయించి శేఖర్ కమ్ముల తీసిన ఈ మూవీ ఏ విధమైన టాక్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే మరి. శేఖర్ కమ్ముల తీసిన ఈ అనామిక మూవీ ఎటువంటి సక్సెస్ ను సాధిస్తుంది? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: