నిన్నటి నుంచి వెబ్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారం కోసం రాష్ట్రమంతా పర్యటించిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఈసారి కరివేపాకులా తీసేయడాన్ని నందమూరి అభిమానులు భరించలేక పోతున్నారు.  అప్పట్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌కు ఖమ్మంలో ఘోర ప్రమాదం జరిగి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డ విషయం చంద్రబాబుకు గుర్తుకు లేదా అని ప్రశ్నిస్తున్నారు.గత ఎన్నికలలో ఆస్పత్రి బెడ్ మీది నుంచే టీవీల ద్వారా ప్రచారం చేయించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబం ముఖ్యంగా జూనియర్ అవసరం లేకుండా పోయాడా? అని ప్రశ్నిస్తున్నారు.  తమ హీరోను పక్కన బెట్టిన చంద్రబాబు తాజాగా పవన్ కల్యాణ్ కోసం ప్రాకులాడుతూ పవన్ ఇంటికి వెళ్ళి చర్చలు జరపడం జూనియర్ అభిమానులు షాక్ అయ్యారు. అవసరానికి ఉపయోగించుకొని వదిలేసే నాయకుడిగా చంద్రబాబు తన వ్యక్తిత్వాన్ని జూనియర్ విషయంలో మరోసారి ఋజువు చేసుకున్నారు అంటు వెబ్ మీడియాలో చంద్రబాబు పై జూనియర్ అభిమానుల ముకమ్మడి దాడి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఈరోజు జూనియర్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగా మీడియా ముందుకు నిజంగా వస్తాడా ఒకవేళ వచ్చినా నందమూరి అభిమానులే జూనియర్ అభిమానులు జూనియర్ కు అంటు ప్రత్యేకమైన అభిమానులు లేరు అన్న బాలయ్య మాటలకు ఎటువంటి కౌంటర్ ఇస్తాడు అన్న విషయం పై సర్వత్రా ఆశక్తి నెలకొని ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: