కన్నడ హీరో సుదీప్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమా తో టాలీవుడ్ లో తన ప్రాభవాన్ని చాటుకున్నాడు. శాండల్‌వుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించుకున్న సుదీప్ ఈగ సినిమాతో కోలీవుడ్‌ లో కూడ పాపులర్ అయ్యాడు. దీనితో త్వరలో రజనీకాంత్ తో తీయబోతున్న కొత్త సినిమాలో సినిమాలో సుదీప్ విలన్‌గా కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.  మొదట్లో ఈ సినిమాకు విలన్ గా జగపతి బాబు పేరు వినిపించినా రజినీ మాత్రం సుదీప్ కే ఓటు వేస్తున్నాడని కోలీవుడ్ టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా మరో ముఖ్యమైన వార్త సుదీప్ గురించి కోలీవుడ్ మీడియాలో హడావిడి చేస్తోంది. ‘ఇళయ దళపతి’గా కోలీవుడ్‌లో ఖ్యాతినార్జించిన విజయ్ సినిమాలో సుదీప్ విలన్ గా కనిపించనున్నాడట.  ఈ సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి సుదీప్ అడుగుపెట్టబోతున్నాడు. గత సోమవారమే ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సుదీప్ సంతకం చేశారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా కోసం అక్షరాల రూ.6 కోట్ల పారితోషికాన్ని సుదీప్ అందుకోబోతున్నాడట. ఒక విలన్ పాత్రకు ఇంత భారీ పారితోషికం అందుకోవడం ఇదే ప్రప్రధమం అని అంటున్నారు.  ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా కనిపించనున్నారని సమాచారం. సుదీప్ హీరోగా కన్నా విలన్ గా ఎక్కువ క్రేజ్ తో పాటు భారీ పారితోషికాలు అందుకునే అదృష్టం ‘ఈగ’ అందించింది అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: