సినిమా తారల రాజకీయ విన్యాసాలకు కేంద్రంగా ఉండే తమిళనాడులో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కోలీవుడ్ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు రాజధాని చెన్నైలో తన ఓటు హక్కును ఈరోజు ఉదయమే వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు సందేశం ఇచ్చారు. తన అభిమానులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని రజనీకాంత్ పిలుపిచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎవరికైనా మద్దతు ఇస్తున్నారా అని విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నానని, ప్రజలు కూడా అదేవిధంగా ఓటు వేయాలని కోరుతున్నానని పిలుపు ఇచ్చారు కొద్దిర్ రోజుల క్రితం మోడీ రజినీ ఇంటికి వచ్చినప్పుడు మోడీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నాను అని బహిరంగంగా అన్న రజినీకాంత్ ఈరోజు ఇలా అనడం వెనుక ఆంతర్యం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రజినీకాంత్ తన మాటల విషయంలో ఇలా యూటర్న్ తీసుకోవడానికి తమిళనాట ఎటు చూసినా వినపడుతున్న జయకేతనమే కారణం అనుకోవాలి. ఈరోజు జరుగుతున్న ఎన్నికలలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒకనాటి టాలీవుడ్ హీరోయిన్ ఈనాటి బుల్లి తెర యాంకర్ ఖుష్బూ లి కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. ఈరోజు దేశవ్యాపతంగా 117లోక్ సభ స్థానాలలో జరుగుతున్న ఎన్నికలు భావి ప్రధానిని నిర్దేశించే విషయంలో ప్రముఖం కానున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: