లక్ష్మీ మంచు తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా గుండెల్లో గోదారి. శేఖర్ కుమార్ దర్శకుడు. తాప్సీ, ఆది, సందీప్, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్ ఇటీవల జరిగింది. లక్ష్మీ ఎన్ని సార్లు పిలిచినా దర్శకుడు ప్రెస్ ముందుకు రాలేదు. ‘ఓవర్ యాక్షన్ ఆపి రమ్మను’ అని తన అసిస్టెంట్ తో బిగ్గరగా చెప్పినా ఫలితం లేకపోయింది.  ‘అంత సిగ్గా’ అని విలేకరి ప్రశ్నించగా ‘అంత లేదు. మనం ఇప్పుడెల్లి బ్బాబ్బాబు అని అడుక్కుంటే వస్తాడు’ అని లక్ష్మీ కామెంట్ చేశారు. అంటే నిర్మాతంటే సదరు దర్శకుడికి గౌరవం లేదనేగా అర్థం అని అందరూ చెవులు కొరుక్కున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: