నయనతార నటించి విడుదలైన చివరి తమిళ చిత్రం బాస్ ఎన్గిర బాస్కిరన్. తెలుగులోనూ విడుదలైంది. ఇందులో ఆర్య కథానాయకుడు. ఆర్య, నయనతార మధ్య ఎప్పటి నుంచో మంచి కెమిస్ట్రీ ఉందని పరిశ్రమ వర్గాల టాక్. అది ఇప్పుడు ప్రేమగా మారిందని కూడా అంటున్నారు. ఇటీవల తాప్సీ ఆర్య వైపు మళ్ళడంతో నయనతార తాప్సీ పేరును వింటే మండిపడుతోందట. వెంటనే ఆర్యకు ఫోన్ చేసి ఈ వార్తల గురించి కూడా మందలించిందట. నయన్ ను కూల్ చేయడానికి ఆర్య తన తదుపరి చిత్రంలో నయనతారను నాయికగా సెలక్ట్ చేసుకోవాలని దర్శకుడికి చెప్పారట. శంకర్ దగ్గర రోబో సినిమాకు పనిచేసిన యాడ్లీ ఈ కొత్త చిత్రాన్ని హ్యాండిల్ చేయనున్నారు. ఏదేమైనా ఆర్య, నయన్ ఓ ఇంటి వారు కాబోతున్నారన్న వార్త చెన్నైలో జోరుగానే షికారు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: