అందాల హీరోయిన్ నయనతార ఇప్పుడు సినిమాలతో బిజీ గా ఉంది. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన తరువాత ఈ సుందరి ఇప్పుడు తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తుంది. శ్రీరామరాజ్యం తరువాత నయనతార నటిస్తున్న సినిమా కృష్ణం వందే జగద్గురం. రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో నయన తార తన పాత్రకు సొంతంగా చెప్పుకుంటుంది. తెలుగులో ఆమె డబ్బింగ్ చెపుకొంటున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. తెలుగులో నయనతార మరొ రెండు సినిమాలలో నటిస్తోంది. నాగార్జునతో లవ్ స్టోరీ సినిమాలోనూ, గోపిచంద్ తో ఒక సినిమాలోనూ నయనతార నటిస్తోంది. అలాగే, నయన తార ఒక తమిళ సినిమాకు సహా దర్శకురాలిగా కూడా పనిచేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: