తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని సహజనటి జయసుధ. ఒకప్పటి టాప్ హీరోలతో హీరోయిన్ గా నటించి నేటి తరం హీరోలకు అమ్మ, వదిన పాత్రలలో కనిపిస్తున్న జయసుధ నేటితరం టాప్ హీరోయిన్స్ పై కామెంట్స్ చేసింది. నేటి తరం హీరోయిన్లలలో కాజల్ అగ్రవాల్ తనకు బాగా ఇష్టమైన అమ్మాయి అని చెపుతూ కాజల్ లో కృత్రిమత్వం చాల తక్కువ అంటూ కాజల్ చాలా అభిమానంగా మాట్లాడుతుంది అని చెప్పుకొచ్చింది జయసుధ. నేటితరం హీరోయిన్స్ అంతా బాగా చదువుకున్న వాళ్ళు అని చెపుతూ నేటితరం హీరోయిన్స్ సమంత, శ్రుతిహాసన్ తెలివితేట్ల ముందు తమ తరం జయప్రద, శ్రీదేవి లాంటి టాప్ హీరోయిన్స్ కూడ సరిపోరని అంటూ సొంత వ్యక్తిత్వంతో పరిస్తుతులను బాగా అర్ధం చేసుకుని వీరంతా కెరియర్ లో చాల స్పీడ్ గా పైకి వస్తున్నారని అభిప్రాయ పడింది జయసుధ. తెలివి తేటల విషయంలోనే కాకుండా మనీ మేనేజ్మెంట్ విషయంలో కూడా నేటి తరం హీరోయిన్స్ తమ తరం హీరోయిన్స్ కన్నా ముందు చూపుతో ఉంటున్నారు అని అభిప్రాయ పడింది ఈ సహజ నటి. దాదాపు ఆరు సినిమాలను నిర్మించి హైదరాబాద్ లో స్థలాలను, ఆస్తులను తాకట్టు పెట్టి ఆర్ధికంగా చాల నష్టపోయి వడ్డీలు మీద వడ్డీలు తాను కట్టినట్లుగా ఈనాటి తరం హీరోయిన్స్ నష్టపోరని చాల వాస్తవిక దృష్టితో ముందు చూపుతో వ్యవహరిస్తున్న నేటి తరం హీరోయిన్స్ ను  చూస్తూ ఉంటె తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందని అభిప్రాయ పడింది జయసుధ. ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను షేర్ చేసుకుంది ఈ ‘బొమ్మరిల్లు’ అమ్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: