టాలీవుడ్ స్వీటి అనుష్కకు తనను చూడటానికి వచ్చిన చిన్న పిల్లల పై కోపం వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. ‘రుద్రమదేవి’ సెట్లో బిజీగా ఉన్న అనుష్క దగ్గరకు ఈమధ్య కొంత మంది పిల్లలు వచ్చారట. వీరంతా ఒక ఫ్యామిలీ చెందిన పిల్లలు అని తెలుస్తోంది. అంత మంది పిల్లలను చూడగానే మన యోగా బ్యూటీ కూడా వారితో సందడిగా మరియు సరదాగానే గడిపింది అని టాక్. ఇంత వరకు బగానే ఉంది. కాని ఇంతలో కొంత మంది పిల్లలు అనుష్క దగ్గరగా వెళ్లిపోయి ‘ఆంటీ అనుష్క ఆటోగ్రాఫ్ ప్లీజ్’ అంటూ అనడంతో ఈ బ్యూటీ అసహనానికి గురైందని యూనిట్ సభ్యులంటున్నారు. అయితే ఆ పిల్లల పిలుపు నచ్చక అనుష్క అలా అసహనానికి గురైందా? లేదంటే ఒకేసారి పిల్లలు అంతా అనుష్క ఆటోగ్రాఫ్ గురించి ఆమె పై మూకమ్మడిగా దాడి చేయడంతో ఇలా ప్రవర్తించిందా అంటూ సెట్ పై ఆమె ప్రవర్తన చూసిన వారు కామెంట్ చేసుకున్నారని టాక్.  అయితే ఆ సెట్ నుండి పిల్లలు అంతా వెళ్లిపోయాక రిలాక్స్ అయిందట మన రుద్రమదేవి. గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలుతున్న అనుష్కకు బహుశ ఈ ఆంటీ పిలుపు నచ్చి ఉండదు. హీరోయిన్స్ సామాన్యంగా తమకు వయసు పెరిగిందని ఒప్పుకోరు కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: