ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ శృతిహాసన్. శృతిహాసన్ ఒకప్పుడు ఐరెన్ లెగ్ హీరోయిన్ గా గా పేరు తెచ్చుకొని, ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా నెంబర్ వన్ స్టార్ డం ని కొనసాగిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా శృతిహాసన్ ఐటెం సాంగ్ లకి యస్ చెబుతుంది. రేసుగుర్రం మూవీలో తను చేసిన డ్యాన్స్ కి థియోటర్స్ షేక్ అయ్యాయి. ఆ విధంగానే శృతిహాసన్ చేత ఐటెం సాంగ్ చేయిస్తే మూవీకి ప్లస్ అవుతుందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందుకే శృతిహాసణ్ చేత ఐటెం సాంగ్ చేయించటానికి పలు మూవీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలతో జతకడుతున్న శృతి, బాలీవుడ్ తరహాలో ఒక పక్క స్టార్ హీరోయినుగా నటిస్తూనే, మరో వైపు ఐటెం పాటలకి కూడా ఓకే చెబుతుంది. అందులోని భాగంగానే ప్రస్తుతం శృతిహాసన్ మహేష్ బాబు నటిస్తున్న ఆగడు మూవీలో ఓ ఐటెం సాంగ్ చేస్తుంది. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం శృతిహాసన్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్నారు. ఈ పాట కోసం అమ్మడు ఏకంగా 80 లక్షలు తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. కేవలం మూడు రోజుల పాటు తీసే ఆ పాటకి అంత మొత్తం డిమాండ్ చేయగా ఆమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఆగడు మూవీలో తమన్న గ్లామర్ ని శృతిహాసన్ కేవలం ఈ ఒక్క పాటతోనే డామినేట్ చేయటం గ్యారెంటీ అని చిత్ర యూనిట్ సైతం అంటుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో శృతిహాసన్ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులని తెగ అలరిస్తుందని అంటున్నారు. మొత్తంగా శృతిహాసన్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించనప్పటికీ, కేవలం ఓ సాంగ్ కోసమే ఫుల్ లెన్త్ హీరోయిన్ తీసుకునే రెమ్యునరేషన్ ని తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: