రజినీకాంత్ అల్లుడు ధనుష్ లేటెస్ట్ గా ఒక కోలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో ఇక ఎప్పటికీ సినిమా చేయనని ప్రకటించడం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. గతంలో తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన ‘3' చిత్రం ఘోర పరాజయం పాలవ్వడంతో మళ్లీ తన భార్య దర్శకత్వంలో సినిమా చేయడానికి తాను సాహసించలేను అని స్పష్టమైన అర్ధం వచ్చేలా ఈ ఇంటర్వ్యులో ధనుష్ తెలియచేసాడు. కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడ క్రేజ్ సంపాదించుకున్న ధనుష్ తాను నటించే హీరోయిన్స్ తో తరుచూ రూమర్స్ రావడం సర్వసాధారణం. కొంత కాలం క్రితం శ్రుతిహాసన్ కు ధనుష్ కు మధ్య ఎదో నడుస్తోంది అని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాయడంతో ధనుష్ ఐశ్వర్యల మధ్య బేధాభిప్రాయాలు రావడమే కాకుండా ఈ విషయం రజినీకాంత్ దృష్టికి వెళ్లి రజినీ ధనుష్ కు క్లాస్ పీకాడు అనే వార్తలు కూడ వచ్చాయి.  ఐశ్వర్య దర్శకత్వం వహించిన ‘3’ సినిమా పరాజయం చెందినా ఆ సినిమాలోని ‘కొలవరి’ పాట ధనుష్ కు ఎంత పేరు తెచ్చి పెట్టిందో ధనుష్ మరిచిపోయాడనుకోవాలి. ఇది ఇలా ఉండగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీల గురించి మాట్లాడుతూ ధనుష్ జర్మనీకి ప్రపంచ కప్ వచ్చే అవకాసం ఉంది అని జోస్యం చెప్పాడు.  మన టాలీవుడ్ హీరోలు ఎక్కువగా క్రికెట్ గురించి మాట్లాడితే కోలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం ఎక్కువగా ఫుట్ బాల్ గురించి మాట్లాడుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: