సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు రిలీజ్ అయిన ప్రిన్స్ మహేష్ బాబు ‘ఆగడు’ టీజర్ చేసిన సంచలనం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ టీజర్ విడుదల అయిన కేవలం మూడు రోజులలోనే 10 లక్షల హిట్స్ ను సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పడంతో పాటు మహేష్ చెప్పిన డైలాగులు కూడా టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారాయి. మహేష్ పంచ్ లకు కోపగించిన కొంత మంది టాప్ హీరోల అభిమానులు మహేష్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు కూడ వేసారు. అయితే ఇప్పుడు ఆ పంచ్ డైలాగులు కేవలం టీజర్ కోసమేనని అసలు ఆ డైలాగులులు సినిమాలోలేవనే ప్రచారం ఫిలింనగర్ లో మొదలైంది.  మహేష్‌ పోలీస్ ఆఫీసర్‌ గా కనిపిస్తున్న ‘ఆగడు’ టీజర్ మొదలవగానే 'సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలవదు గాని పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా వుంది’ అంటూ ఓ పంచ్ ఇస్తాడు. ఇక తర్వాత మరో డైలాగ్ గా ‘ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతోటి ఎదవ కంపారిజన్... ఎలపరం వచ్చేస్తంది’ అని అంటూ మరో పంచ్ ఉంది. ఈ పంచ్ లను చూసి మహేష్ అభిమానులు వీరంగం సృష్టించారు. అయితే అసలు సినిమాలో ఈ పంచ్ డైలాగ్స్ లేకుండా చేసి మిగతా హీరోల అభిమానులతో సమస్యలు రాకుండా శ్రీను వైట్ల ఈ డైలాగ్స్ ను కేవలం టీజర్ కు మాత్రమే పరిమితం చేసాడా? లేకుంటే సినిమాతో సంబంధం లేకుండా ‘ఆగడు’ టీజర్ క్రేజ్ పెంచడం కోసం ఇది అంతా క్రియేట్ చేసాడా అన్న విషయం ‘ఆగడు’ రిలీజ్ అయితేకాని తెలియదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: