ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణం కాబోతున్న ఒక మల్టీ స్టారర్ సినిమా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం మలయాళంలో హిట్ అయిన 'బెంగుళూరు డేస్' మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ కలిసి నిర్మించడం. తెలుగు, తమిళంలో రీమేక్ కాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ ఉంటారట. ఈ సినిమాలోని ఒక హీరో పాత్రకు చైతన్య సరిపోతాడని దిల్ రాజ్ భావించడంతో దిల్ రాజ్ చైతన్యను ఒప్పించడానికి చాల ఒత్తిడి చేస్తున్నాడు అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి.  అయితే చైతన్య ఈ విషయంలో ఎటూ తేల్చకుండా రోజులు గడిపేస్తూ ఉండటంతో విసిగిపోయిన దిల్ రాజ్ చైతూ స్థానంలో సిద్ధార్థను కానీ లేదంటే తమిళ హీరో ఆర్యను కానీ తీసుకుందామనే నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోగా నటించడానికి నాని అంగీకరించడంతో మూడోహీరోగా శర్వానంద్ ను పరిశీలిస్తున్నారని టాక్ నానీ, శర్వానంద్ లకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడ క్రేజ్ ఉండటంతో సిద్ధార్ధ ఈ సినిమాలో నటిస్తే మరింత ప్లస్ అవుతుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమాలో సిద్దార్దను నటింప చేయడానికి సమంత కూడ తన వంతు కృషిని చేస్తున్నట్లు మీడియా టాక్. ఎదిఎమైనా నాగచైతన్య తేల్చుకోలేకపోతున్న నిర్ణయం సిద్దార్ధకు కలిసి వచ్చినట్లే అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: