టాలీవుడ్ టాప్ దర్శకులలో వినాయక్ ది విభిన్నశైలి. వినాయక్ సినిమాలలో గాలిలోకి ఎగిరే సుమోలు దగ్గరనుంచి ప్రేక్షకులను పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వులు కూడ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయడంలో వినాయక్ దిట్ట. గత సంవత్సరం విడుదల అయిన ‘నాయక్’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని వినాయక్ డైరెక్ట్ చేసిన ‘అల్లుడు శీను’ ఈ నెల25న విడుదల కాబోతోంది. అయితే దర్శకుడు వివి వినాయక్ కు రెండు టెన్షన్లు పట్టి పీడిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అంచనాలకు మించిన ఖర్చుతో నిర్మించిన ‘అల్లుడు శీను’ సినిమా అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విజయం వినాయక్ కు పెద్ద సవాల్ గా మారింది అని అంటున్నారు. దీని ఫలితం ఎలా వుంటుందా అని కిందామీదా టెన్షన్ పడుతున్నాడు వినాయక్ అని సెటైర్లు పడుతున్నాయి. బెల్లంకొండ సురేష్ తనపైనే మొత్తం భారం పెట్టి, భారీగా ఖర్చు పెట్టి సమంత, తమన్నా లాంటి హీరోయిన్స్ ను తెచ్చి అన్ని విషయాలలోనూ సహకరించినా అనుకోకుండా ఈ సినిమా ఫలితం రివర్స్ అయితే దాని ప్రభావం తనపైనే వుంటుందని వినాయక్ టెన్షన్ అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క మెగాస్టార్ ప్రెస్టీజియస్ మూవీకి తానే డైరక్ట్ చేస్తానని వినాయక్ కు నమ్మకం ఉన్నా ఒక చిన్న ట్విస్ట్ ఉంది అని ఫిలింనగర్ టాక్. ఆగస్టు 22 లోగా వినాయక్ చిరంజీవికి నచ్చే కధను తేగలిగితే ఆ అవకాశం వినాయక్ కి దక్కుతుంది. అయితే ఈ లోగా ఎవరైనా చిరుకు నచ్చే కథ తెచ్చిన పక్షంలో మాత్రం చాన్స్ ఆ డైరక్టర్ కు వెళ్లిపోతుంది అని అంటున్నారు. దీనితో చాలా మంది డైరక్టర్ లు ఈ పనిలో బిజీగా వున్నారు అని టాక్. అందుకే ఇప్పుడు ఆ చాన్స్ వదులుకోకుండా వుండడం కోసం వినాయక్, తన రచయిత ఆకుల శివతో కలిసి ఎలాగైనా చిరంజీవికి నచ్చే కథను తయారు చేయాలి అని టెన్షన్ పడుతున్నాడట. దీనితో ఒకేసారి రెండు టెన్షన్ ల మధ్య వినాయక్ నలిగి పోతున్నాడు అని సెటైర్లు వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: