పవన్ తో ‘పంజా’ సినిమాను తీసిన విష్ణువర్ధన్ సినిమాలను చాలా స్టైల్ గా డిఫెరెంట్ గా తీస్తాడని పేరు ఉంది. పవన్ తో తీసిన పంజా పరాజయం చెందినా ఆసినిమాలో విష్ణువర్ధన్ టేకింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గత సంవత్సరం క్రైమ్ కామెడీ సినిమాగా నిఖిల్ తో నటిస్తూ ‘స్వామిరారా’ సినిమాతో ముందుకు వచ్చిన స్వాతి ఈ సంవత్సరం ‘బంగారు కోడిపెట్ట’ గా వచ్చినా ఎక్కడా వర్కవుట్ కాలేదు.  దీనితో స్వాతి ప్రస్తుతం తెలుగులో తన ఆశలన్ని ‘కార్తికేయ’ సినిమాపై పెట్టుకుంది. ఈనేపధ్యంలో స్వాతికి అనుకోని అదృష్టం తలుపు తట్టింది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో స్వాతి నటించిన ‘వడకర్రీ’ థియేటర్స్ లో ఉండగా 'పంజా' చిత్రానికి దర్శకత్వం వహించిన విష్ణువర్ధన్ దర్సకత్వ్యం వహిస్తున్న 'యాటచ్చన్' అనే తమిళ చిత్రంలో స్వాతికి అనుకోని జాక్ పాట్ అవకాసం కొట్టేసింది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆర్య, క్రేష్ నా హీరోలుగా నటిస్తుండగా ఆర్య సరసన కొత్త అమ్మాయి దీపా సన్నిధి కధానాయికగా నటిస్తూ ఉండగా ఇక క్రేష్ సరసన స్వాతి కథానాయికగా ఎంపికయ్యింది. ఈ సినిమాలో స్వాతిని బబ్లీ గర్ల్ గా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తాడట విష్ణువర్ధన్. ఈ సినిమాతో స్వాతి దస తిరగడం ఖాయం అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: