పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలుచుని నీళ్లు తాగడం మంచిది అంటోంది కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం తెలుగులో కృష్ణవంశీ సినిమాలో నటిస్తోందీ అమ్మణి. ఈ సినిమాలో రామ్‌చరణ్‌తో జోడీ కడుతోంది. తెలుగులో ఈమె చేతిలో ఇంకో సినిమా ఉంది. హిందీ, తమిళంలోనూ ఒక్కో సినిమా చేస్తోంది. దీని గురించి కాజల్‌ మాట్లాడుతూ ‘‘ఎవరో తరుముతున్నట్టు ఆదరాబాదరా సినిమాలు చేసేయడం నాకు నచ్చదు. అలా చేస్తే ఏ సినిమాకూ, ఏ పాత్రకూ న్యాయం చేయలేం. ఏక కాలంలో ఒక షూటింగ్‌ చేస్తే తప్పకుండా త్రికరణ శుద్ధిగా ఆ పాత్రలోనే లీనమై ఉంటాం. 100శాతం పాత్రకు న్యాయం చేయగలుగుతాం. అలా కాకుండా అన్నీ చేసేయాలని ఆతృత పడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ‘లక్ష్మీకల్యాణం’ సినిమాలో చూసినప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది కాజల్‌. దాని గురించి ఈ భామ మాట్లాడుతూ ‘‘నేను ప్రతిరోజూ తప్పకుండా యోగా చేస్తాను. మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి, శారీరకంగా చురుగ్గా ఉండటానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. అందుకే యోగాను మానను. యోగా ఈజ్‌ ద సీక్రెట్‌ ఆఫ్‌ మై బ్యూటీ’’ అని చెప్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: