“మనం” సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ ఇచ్చిన షాక్ కు మహేష్ మైండ్ బ్లాంక్ అయింది అంటూ ఫిలిం నగర్ లో సెటైర్లు పడుతున్నాయి. ‘మనం’ సూపర్ హిట్ తరువాత మహేష్ ను కలిసిన విక్రమ్ కుమార్ ఒక మంచి స్టొరీ లైన్ మహేష్ కు వినిపించాడని టాక్. ఆ స్టొరీ లైన్ టాలీవుడ్ ప్రిన్స్ కు బాగా నచ్చడంతో ఆ సినిమా తాను చేస్తానని ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో మొదలు పెడదామని మాట ఇచ్చాడట. దీనికి అంగీకరించిన విక్రమ్ కుమార్ కు అనుకోకుండా కోలీవుడ్ టాప్ హీరో సూర్య దగ్గర నుంచి కాల్ రావడంతో సుర్యాను కలిసాడు విక్రమ్. అక్కడ  తాను, తన తమ్ముడు కార్తీ తన తండ్రి ముగ్గురు కలిసి నటించే విధంగా ‘మనం’ లాంటి మంచి కధను చెప్పమని సూర్య అడిగితే విక్రమ్ తన దగ్గర ఉన్న మహేష్ కు వినిపించిన కధను వినిపించాడట. ఈ కధ సుర్యాకు విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాను తానే నిర్మిస్తానని వెంటనే షూటింగ్ కు వెళ్ళి పోదామని సూర్య క్షణాల పై నిర్ణయం చెప్పడంతో విక్రమ్ మహేష్ కు చెప్పిన కధ సూర్య ఇంట వాలిపోయింది. నిన్న చెన్నైలో తాను విక్రమ్ దర్శకత్వంలో అతి త్వరలో ఒక సినిమా చేయబోతున్నానని సూర్య ప్రకటించడంతో ఈ న్యూస్ ‘ఆగడు’ హడావిడిలో ఉన్న మహేష్ బాబుకు షాకింగ్ న్యూస్ గా మారింది అని అంటున్నారు.  ఈ సినిమాను సూర్య తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తాడట. ఎప్పటి నుంచో డైరెక్ట్ సినిమాతో టాలీవుడ్ కు ఎటాక్ ఇవ్వాలి అని అనుకుంటున్న సూర్య కలలకు విక్రమ్ కుమార్ కధతో పరిష్కారం దొరికింది అని అంటున్నారు. ఈ మధ్యనే విడుదల అయిన సూర్య ‘అంజాన్' ట్రైలర్‌కు యూట్యూబులో మంచి రెస్పాన్స్ రావడంతో మంచి జోష్ మీద ఉన్న సూర్య టాలీవుడ్ కలలు అతిత్వరలో విక్రమ్ కుమార్ ద్వారా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: