తమ అభిమాన హీరో రామ్ చరణ్ 50 కోట్లు పోగొట్టుకున్నాడు అంటూ రామ్ చరణ్ భజన రాయుళ్ళు టాలీవుడ్ లో చేస్తున్న భజన అందరికీ ఆశ్చర్యంగానే కాకుండా చాలామందికి మైండ్ బ్లాంక్ చేస్తోంది. అసలు ఈ కధకు వివరాలలోకి వెళితే ఒక ఆశక్తికర విషయం బయటకు వస్తోంది.  చరణ్ ‘జంజీర్’ చేస్తున్న సమయంలో ఆ సినిమా తరువాత చరణ్ తో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారీకర్ చెర్రీతో ఒక భారీ సినిమా బాలీవుడ్ లో తీస్తాడు అని వార్తలు వచ్చాయి. ఈ సినిమా ‘మగధీర’ రేంజ్ లో ఉంటుంది అని కూడ మీడియా వార్తలు వ్రాసింది. ఈ వార్తల గురించి అప్పట్లో చరణ్ ను అడిగితే చరణ్ ఈ వార్తలను ఖండించ కుండా తాను ఇంకా ఏమి నిర్ణయించుకోలేదు అని తెలివిగా సమాధానం దాటవేసాడు. ఆ తరువాత చరణ్ ‘గోవిందుడు అందరివాడే’ లో బిజీ అయిపోయాడు. అయితే అప్పట్లో చరణ్ తో సినిమా తీస్తాడు అనుకున్న అశుతోష్ గోవారీకర్ తన సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించడమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు 50 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లుగా మీడియా వార్తలు వ్రాస్తోంది. ఒక చారిత్రిక కధాంశంతో రూపొందుతున్న ఈసినిమా బాలీవుడ్ సంచలనం అని అంటున్నారు.  అయితే ఈ వార్తలను విన్న రామ్ చరణ్ మెగా అభిమానులు తమ హీరో చరణ్ టాలీవుడ్ కోసం బాలీవుడ్ ఆఫర్ ను వదులుకోవడమే కాకుండా ఏకంగా 50 కోట్లు పోగొట్టుకున్నాడు అని చేస్తున్న ప్రచారం టాలీవుడ్ జోక్ గా మారింది అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే చాన్స్ రామ్ చరణ్ మిస్ చేసుకున్నాడు అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: