టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేయాలని అందరూ అనుకుంటారు. కాని అలా కుదరకపోతే కనీసం టాప్ ఐటెం గర్ల్ గా అయిన పేరే సంపాదించాలని చూస్తుంటారు. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఐటెం గర్ల్ గా హంసా నందిని పేరు తెచ్చుకుంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించిన హంసా నందిని, చివరకు ఐటెంగాళ్ గా మారి అగ్రహీరోలతో చిందులేస్తుంది. టాప్ హీరోల తరసన తన వాడి వేడి అందాల్ని చూపిస్తూ, యూత్ మతిపోగొడుతుంది. ఇదిలా ఉంటే ఈ భామ ఇప్పుడు మరో ఐటెం సాంగ్ లో అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటికే ప్రభాస్, నాగార్జున, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెంగాళ్ గా హంసా నందిని నటించింది. అంతే కాకుండా ఈగ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెక్సీగా అలరించింది. ముఖ్యంగా ప్రభాస్ ‘మిర్చి’, పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో చేసిన స్పెషల్ సాంగ్స్ తో హంసానందిని స్పెషల్ సాంగ్స్ కి డిమాండ్ పెరిగింది. లెజెండ్ సినిమాలోనూ హంసా నందిని స్సెషల్ సాంగ్ కి చిందులేసి టాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. ఇదిలా ఉంటే హంసా నందిని ఐటెం సాంగ్ అంటే దాదాపు ముఫై లక్షలను తీసుకుంటుందని టాలీవుడ్ టాక్. ఇప్పుడు ఆ రేటుని కాస్త పెంచి నలభై నుండి యాభై వలరకూ తీసుకుంటుందని అంటారు. అయితే తాజాగా తను మరో కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోపిచంద్ హీరోగా, శ్రీ వాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఈ చిత్ర యూనిట్ హంసా నందినిని అడగగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆగష్టులో ఈ స్పెషల్ సాంగ్ ని షూట్ చేయనున్నారు. అయితే ఈ మూవీకి తను ఐటెం సాంగ్ చేసేందుకు దాదాపు యాభై లక్షలను డిమాండ్ చేసిందట. తరువాత గోపి చంద్ మూవీలో అని మేటర్ తెలుసుకున్నాక పది లక్షల వరకూ తన రెమ్యునరేషన్ ని తగ్గించుకుందని అంటున్నారు. గోపిచంద్ సరసన హీరోయిన్ గా నటించాలని హంసా నందిని కోరికట. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేసుకుంటూ తన కోరికను తీర్చుకుంటుంది. అందుకే గోపిచంద్ మూవీకి పది లక్షల వరకూ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడంతో ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: