ఈ మధ్యనే తనకు జరిగిన ప్రమాదం నుండి కోలుకుని తిరిగి ప్రభాస్ బాహుబలి షూటింగ్ లో తిరిగి పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితులలోను ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో రాజమౌళి ఈ సినిమా యూనిట్ ను పరుగులు తీయిస్తున్నాడు. ఈ నేపధ్యంలో మరో పెద్ద ప్రమాదం నుండి రమ్యకృష్ణ, ప్రభాస్‌ని గట్టెక్కించింది అని వార్తలు వస్తున్నాయి  బాహుబలి సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ మరొకసారి లీక్ అయింది. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు తల్లిగా రాజమాత రోల్‌లో రమ్యకృష్ణ కనిపిస్తోంది అన్న విషయం తెలిసిందే. తమ రాజ్యంపై దాడి చేసిన శత్రువుల నుంచి శివుడు(ప్రభాస్)ని దూరంగా తీసుకెళ్తోంది రాజమాత. ఈ క్రమంలో ఓ చోట నది దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఈ నేపథ్యంలో రాజమాత తన ప్రాణాలను పోగొట్టుకుని శివుడిని కాపాడుతుంది. ఈ సన్నివేశాన్ని రాజమౌళి తనదైన స్టైల్ లో పిక్చరైజేషన్ చేసి యూనిట్ తో ప్రసంసలు పొందాడు. ఈ సీన్ లో రమ్యకృష్ణ చాల మంచి నటన కనపరిచిందని యూనిట్ టాక్. ఈమధ్యనే కేరళలోని ఫారెస్టు లొకేషన్‌లో ఈ షూటింగ్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 175 కోట్ల బడ్జెట్ సినిమాగా బాహుబలి మారడంతో ‘బాహుబలి’ గురించి ఏ చిన్న న్యూస్ లీక్ వచ్చినా అది మీడియాకు హాట్ టాపిక్ అవుతోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: