పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు నందమూరి తారకరామారావు. ఆయన వారసుడిగా ఈరోజు టాలీవుడ్ టాప్ హీరో స్థాయిని అందుకున్న బాలకృష్ణ కూడ పౌరాణిక పాత్రలను చేస్తూ తన అభిమానులను మెప్పిస్తున్నాడు. ‘లెజెండ్’ సూపర్ సక్సస్ తో మంచి స్పీడ్ మీద ఉన్న బాలయ్య వరస పెట్టి సినిమాలు చేస్తూ తన 100వ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.  తన కెరియర్ లో తన 100వ సినిమా చిరస్థాయిగా నిలిచి పోవాలనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ తన 100వ సినిమా కధ దర్శకుడి విషయంలో రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే బోయపాటి, రాజమౌళిలతో బాలయ్య సినిమా ఉంటుందని కధనాలు కూడ వచ్చాయి. అదేవిధంగా బాలకృష్ణ గతంలో చేసిన ‘ఆదిత్య 369’ సినిమాకి సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ సినిమా చేస్తాడని వార్తలు కూడ వచ్చాయి.  ఇది ఇలా ఉండగా బాలయ్య మనసు తిరిగి ‘నర్తనశాల’ పై మళ్ళింది అనే వార్తలు కూడ వినపడుతున్నాయి. గతంలో ఇదే నర్తనశాల సినిమాను బాలకృష్ణ తన సొంత దర్సకత్వంలో సౌందర్య ద్రౌపది పాత్రలో మొదలుపెట్టి ఆమె చనిపోవడంతో ఆ సినిమాను మధ్యలో వదిలి వేసాడు. ఆ తరువాత బాలకృష్ణ నర్తనశాలను మరిచిపోయాడు.  ప్రస్తుతం ‘లెజెండ్’ సూపర్ సక్సస్ తో మంచి క్రేజ్ మీద ఉన బాలకృష్ణ తిరిగి నర్తనశాల స్క్రిప్ట్ కు మార్పులు చేర్పులు చేయిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే బాలయ్య 100వ సినిమా ‘నర్తనశాల’ అంటూ తిరిగి వార్తలు ఊపు అందుకున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థుతులలో ఈ సినిమాలోని ద్రౌపది పాత్రకు ఎవరు హీరోయిన్ అన్న విషయం పై క్లారిటీ లేదు. బాలకృష్ణ ప్రస్తుత పరిస్థుతులలో ఇటువంటి సాహసం చేస్తాడ అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎదిఎమైనా ‘నర్తనశాల’ తిరిగి రంగ ప్రవేశం చేస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: