దృశ్యం విజయం విక్టరీ వెంకటేష్ ను జోష్ లో పెట్టడమే కాకుండా అతడిలోని ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచింది. గతంలో వెంకీ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్పీడ్ గా సినిమాలు చేసేవాడు. గత కొన్ని సంవత్సరాలుగా తనను వెంటాడిన పరాజయాల నీడ నుండి వెంకటేష్ ‘దృశ్యం’ ఇచ్చిన జోష్ తో కోలుకోవడమే కాకుండా మరో ప్రయోగానికి లైన్ క్లియర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి
ప్రస్తుతం పవన్ తో ‘గోపాలా గోపాలా’ లో నటిస్తున్నా తన తదుపరి సినిమా పై అప్పుడే ద్రుష్టి పెట్టినట్లు టాక్. దీనికోసం కొంతమంది దర్శకులు వెంకీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారట. ఈ నేపధ్యంలో వెంకీ ఇదివరకు విన్న ఓ కథని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో పిల్ల జమిందార్` ఫేమ్ అశోక్ తయారు చేసిన ఓ కథ వెంకటేష్కి బాగా నచ్చింది అని అని టాక్. అదొక మూకీ చిత్రం అట కమల్ నటించిన `పుష్పకవిమానం` తరహాలో ఉంటుందట. ఇదివరకే ఆ కథని వెంకీ ఓకే చేశాడు అని అంటారు. సెట్స్ పైకి తీసుకెళ్లడమే ఆలస్యం అనుకొంటున్న తరుణంలో అశోక్ తీసిన `సుకుమారుడు` ఫ్లాప్ అవ్వడం. వెంకీ చిత్రం `షాడో` కూడా ఘోర పరాజయం చెందడంతో, అలాంటి పరిస్థితుల్లో ప్రయోగాలు చేయడం అంత మంచిది కాదనుకున్న వెంకీ ఈ మూకీ ప్రాజెక్టును పక్కనపెట్టేశాడు అని అంటారు.
తాజాగా `దృశ్యం`తో వెంకీకి హిట్ లభించడంతో మళ్లీ అశోక్ కథని బయటికి తీసేపని మొదలు పెట్టాడట ఈ విక్టరీ హీరో. ఇది ఇలా ఉండగా కేవలం 1o కోట్ల బడ్జెట్ తో తీసిన ‘దృశ్యం’ సుమారు ౩౦ కోట్లు వసూలు చేస్తుందని టాలీవుడ్ ట్రేడ్ పండితుల టాక్.
మరింత సమాచారం తెలుసుకోండి: