తెలుగు సినిమా ప్రముఖ దర్శకుడు దాసరి నందమూరి బాలకృష్ణ తో తీసిన తన 150వ సినిమా ‘పరమ వీరచక్ర’ ఘోర పరాజయం చెందడంతో నిరాశకు లోనై గత కొద్ది సంవత్సరాలుగా సినిమాలు తీయకుండా కేవలం సినిమాల పై కామెంట్స్ చేస్తూ కలం గడిపేస్తున్నారు. ఈ నేపధ్యంలో దాసరి లాంటి ప్రముఖ వ్యక్తి కూడ ఒక రీమేక్ సినిమాను నమ్ముకోవడం అందర్నీ ఇప్పటికే ఆశ్చర్య పరిచింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘మన్జపాయ్’ సినిమా రైట్స్ ను కొని ఇప్పుడు ఈ సినిమాను మంచు వారి అబ్బాయి విష్ణు హీరోగా ఈనెల 24వ తారీఖు నుండి సెట్స్ పైకి తీసుకు వెళుతున్నారు.  టాలీవుడ్ లో తెలుగు రచయితలు లేరా? టాలీవుడ్ లో బాగా నటించే హీరోయిన్స్ లేరా? అని వేదికల పై ప్రశ్నించే దాసరి ఈసారి మారిపోయిన పరిస్థుతులలో తాను కూడ మారిపోయి ఒక రీమేక్ సినిమాతో పాటు మలయాళ హీరోయిన్ ను కూడ ఎంచుకోవడం మరింత ఆశ్చర్య పరుస్తోంది. వెండితెర పై ఎక్స్ పోజింగ్ చేయడంలో మంచి పేరున్న కేధరిన్ ట్రెసాను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసాడు దాసరి. ‘పైసా’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాల ద్వారా హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కేధరిన్ ను దాసరి ఎలా ఎంపిక చేసారు అనే టాక్ కూడ వినిపిస్తోంది. తాతా మనవడు పాత్రల చుట్టూ తిరిగే ఈ సినిమా కధకు తాను మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ‘తాతా మనవడు’ టైటిల్ ను ఈ సినిమాకు పెట్టాలని దాసరి ఆలోచిస్తున్నాడు అని న్యూస్. ఒక తమిళ కధకు మరో మలయాళ హీరోయిన్ ను జతచేసి దాసరి నమ్ముకున్న ‘తాతా మనవడు’ సెంటిమెంట్ ఈ సినిమాను ఎంత వరకు రక్షించి దాసరికి పూర్వ వైభవం తెచ్చి పెడుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: