నాగార్జునకు కెరియర్ పరంగా ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మనం’ సూపర్ హిట్ కావడమే కాకుండా నాగ్ బుల్లి తెర పై చేస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ బుల్లితెర టాప్ ర్యాంకింగ్స్ లోకి వెళ్లిపోవడంతో నాగార్జున మంచి జోష్ మీద ఉన్నాడు.  ఈ నేపధ్యం లో నాగార్జునను ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు అమల కూడ బుల్లితెరను టార్గెట్ చేయబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ‘ఉయిర్మెయ్’ అనే ఓ త‌మిళ సీరియల్ లో న‌టించ‌డానికి అమ‌ల అంగీకారం తెలిపింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సీరియల్ ను నిర్మించబోతోంది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక హాస్పిటల్లో పనిచేసే ఏడుగురు డాక్ట‌ర్ల జీవితాల చుట్టూ తిరిగే కధ ఇది అని అంటున్నారు. ఈ సీరియల్ లో అమల ఒక డాక్టరుగా నటించబోతోంది అని న్యూస్. ఈ సీరియల్ కధ నచ్చడంతో అమల ఈ సీరియల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు. తెలుగు బుల్లి తెరను ప్రస్తుతం నాగ్ ఏలుతూ ఉంటే తమిళ బుల్లి తెరను అమల టార్గెట్ చేస్తోంది అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: