టాలీవుడ్ సినిమారంగం అంతా వారుసులతో నిండిపోతోంది. హీరోలు, నిర్మాతలు, దర్శకుల వారసులతో టాలీవుడ్ బయట వ్యక్తి రావడానికి కూడా చోటు లేనంతగా కిక్కిరిసి పోతోంది. టాలీవుడ్ సెలిబ్రిటీల క్రేజ్, ఆదాయాలను చూసి సినిమా పరిశ్రమలోని వారసులు అంతా సినిమా బాట పడుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ లిస్టులోకి దర్శకరత్న దాసరి నారాయణ రావు మనవ రాలు కూడ చేరిపోతోoది. ఆ అమ్మాయి పేరు నిరాజిత అని తెలుస్తోంది.  ప్రస్తుతం దాసరి తన 151వ సినిమాగా ఒక తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో కేథ‌రిన్ నాయిక‌. ఈ చిత్రానికి ‘ఎర్ర బ‌స్’ అనే టైటిల్ కుడా పెట్టేసారు. రెండు రోజుల క్రితం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ఈ సినిమా మొదలు అయింది. ఈనెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ అనే వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణతో దాసరి తీసిన ప‌ర‌మవీర‌చ‌క్ర ఘోర పరాజయం తరువాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. స్వంత కధలను నమ్ముకునే దాసరి తమిళంలో సూపర్ హిట్ అయిన మంజ‌పాయ్‌ సినిమాను విపరీతమైన పోటి మధ్య ఫాన్సీ రేట్ పెట్టి కొన్న సినిమా ఇది. కోలీవుడ్ లో కేవలం 5 కోట్ల పెట్టుబడి తో తీసిన ఈ సినిమా 20 కోట్లు పైగా వాసులు చేసి కోలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.  తాతా మనవడి పాత్రలు చుట్టూ తిరిగే ఈ సినిమాలో దాసరి మనమరాలు నిరాజితకు కుడా ఒక ప్రముఖ పాత్ర ఉంది అని టాక్. తాతకు తగ్గ మనవరాలుగా ఈ సినిమాలో నిరాజిత ఎలా మెప్పిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: