ప్రస్తుతం నందమూరి సింహం బాలయ్యకు హీరోయిన్ సమస్య తీర్చి ‘గాడ్సే’ లో నటిస్తున్న త్రిష పనిలో పని గా టాప్ డైరెక్టర్ మణిరత్నంను కూడ ఆదు కున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. నాగార్జున మహేష్ లతో ఒక భారీ సినిమా తీద్దాం అనుకున్న మణిరత్నం కలలు సాకారం కాకపోయినా మణి కోలీవుడ్ యంగ్ హీరో జై తో ఒక వెరైటీ ప్రేమకధను తమిళ తెలుగు భాషలలో తీయబోతున్నాడు. అయితే ఇక్కడ కూడా మణిరత్నంకు హీరోయిన్ సమస్య ఎదురు అయ్యింది. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న జైతో ఏ పెద్ద హీరోయిన్ నటించడానికి ఇష్టపడక పోయినా త్రిష మాత్రం మణిరత్నం మాట తీయలేక ఈ సినిమాను ఒప్పుకుందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. గతంలో మణి రత్నం తీసిన ‘యువ’ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ సినిమాను చేస్తూ మణిరత్నం దగ్గర పారితోషికం బాగా లాగేసిoదని మీడియా టాక్. ఇది ఇలా ఉండగా తనకు మూడు పదుల వయస్సు దాటిపోయినా ఇప్పుడు వస్తున్నన్న కుర్ర హీరోల సరసన అవకాశాలను కొట్టేస్తూ జీవా, జయం రవిలతో సినిమాలు చేస్తూ ఒక వైపు కుర్ర హీరోలతో మరో వైపు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ తన హవా ఇంకా ముగిసి పోలేదని సంకేతాలు ఇస్తోంది ఈ చెన్నై సుందరి. అందుకే త్రిష తెలివితేటలకు కోలీవుడ్ మీడియా ఆశ్చర్యపోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: