యాంకర్ అనసూయ హవా భారతదేశం సరిహద్దులు దాటిపోయి అమెరికాలోని తెలుగువారిని షేక్ చేస్తోంది. ప్రస్తుతం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ అమెరికాలో చేస్తున్న మ్యూజిక్ టూర్ ఈవెంట్స్ టీంలో తాను కూడ ఉన్నాను అంటూ అనసూయ కొన్ని ఫోటోలు ట్వీట్ చేసి తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకుంది. జులై 6 నుండి ఆగస్ట్ 9 వరకూ అమెరికాలోని ప్రవాసాంధ్రుల కోసం దేవీశ్రీప్రసాద్ కొన్ని స్టేజ్ షోలు నిర్వహిస్తున్నాడు. ఈ షోలకు విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్ తో పాటు స్టేజ్ పై అనసూయ చేస్తున్న హంగామా కూడ అమెరికాలోని తెలుగువారిని విపరీతంగా ఆకర్షిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ స్టేజ్ షోలకు సంబంధించి అనసూయ తన కుమారుడు, దేవీశ్రీప్రసాద్ లతో కలిసి తీయించుకున్న ఫోటోలను తన ట్విటర్ లో పోస్టు చేసింది. అంతేకాదు అట్లాంటా ఈవెంట్ ఆదరగొట్టామని సాన్‌జోస్‌కు రెడీ అవుతున్నామని, మరో ఆరు ఈవెంట్స్ కు ప్రిపేర్ అవుతున్నామని తన ట్విట్ లో తెలియచేసింది. పిల్లలు పుట్టిన తరువాత కూడ తన హాట్ లుక్స్ ను కొనసాగిస్తూ టాప్ యాంకర్లకు పోటీ ఇస్తున్న అనసూయ హంగామాను అమెరికాలోని తెలుగు వారు ఏమేరకు భరిస్తున్నారో మరి.   

మరింత సమాచారం తెలుసుకోండి: