దర్శకుడు వినాయక్ ను చిరంజీవి 150వ సినిమా వ్యవహారం టార్చర్ పెడుతోంది అనే వార్తలు వినపడుతున్నాయి. ‘అల్లుడు శీను’ నిర్మాణo మధ్యలో ఉండగానే వినాయక్ కు రెండు సినిమాలు దర్సకత్వం వహించే అవకాశం వచ్చినా చిరంజీవి 150వ సినిమాను దృష్టిలో పెట్టుకుని ఆ ఆఫర్లు వదులుకున్నాడు అని ఫిలింనగర్ టాక్. వేరే సినిమాల ప్రాజెక్టుల మధ్య చిక్కుకునిపోతే చిరంజీవి 150వ సినిమా ఛాన్స్ మిస్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో ఇలా తనకు వచ్చిన సినిమాలను వినాయక్ వదులుకున్నాడు అని అంటారు. కానీ వినాయక్ ఊహలకు భిన్నంగా ఈరోజు మెగా కాంపౌండ్ లో జరుగుతున్న పరిణామాలు వినాయక్ ను షాక్ కు గురిచేస్తున్నాయి అని టాక్. చిరంజీవిని అన్నా అంటూ ఎంతో అభిమానంగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వినాయక్ గత కొంతకాలంగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో చిరంజీవి 150వ సినిమాకు తానే దర్శకుడిని అని అర్ధం వచ్చేడట్లుగా మాట్లాడి హడావిడి చేసాడు.  చిరంజీవి కోసం దాదాపు ఒక ఐదారు కధలను కూడ రెడీ చేసానని ఆ ఇంటర్వ్యూలలో చెప్పాడు వినాయక్. అయితే గత కొద్దిరోజులుగా చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరు ఇంచుమించు ఫైనల్ అయింది అని వస్తున్న వార్తలు వినాయక్ కు షాకింగ్ గా మారాయి అని అంటున్నారు. ఈవిషయం పై క్లారిటీ తీసుకుందామని వినాయక్ ప్రయత్నిస్తున్నా మెగా కాంపౌండ్ నుండి సరైన సమాచారం రాకపోవడం వినాయక్ కు మరింత షాకింగ్ గా మారింది అని అంటున్నారు.  అదేవిధంగా తాను చిరంజీవి కోసం తయారు చేసిన కధలను వినే విషయంలో కూడ మెగా కాంపౌండ్ కాలయాపన చేస్తూ ఉండటంతో తన ఆశల పై మెగా కాంపౌండ్ నీరుకారుస్తుందా? అనే భయాన్ని వినాయక్ తన సన్నిహితుల వద్ద వ్యక్త పరుస్తున్నాడు అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: