సినిమా సెలెబ్రెటీలు తమ పై గాసిప్ వార్తలను వ్రాసే వెబ్ సైట్లను, పత్రికలను చూసి భయపడుతూ ఉంటారు. కాని ఒక ప్రముఖ ఛానల్ లో ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్న టాక్ షో బాలీవుడ్ సినిమా రంగంలోని చాల మందిని భయ పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి.
గతంలో నిగార్ జెడ్ ఖాన్ హోస్ట్గా ఏబీపి ఛానల్ లో ప్రసారమైన ‘లవ్ స్టోరీ’ టాక్ షో చాల పాపులర్ అయింది. దీనికి అప్పట్లో చాల మంచి రేటింగ్స్ కూడ వచ్చాయి. కొంత గ్యాప్ తీసుకున్న తరువాత ఈ 'లవ్ స్టోరీ' అనే టాక్ షో మళ్ళీ 'లవ్ స్టోరీ' సీజన్ 2 పేరిట నేటినుంచి బుల్లి తెరపైకి రానున్నది. స్టార్ న్యూస్ ఆద్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ ఏబీపి ఛానల్ బాలీవుడ్ మరియు పోలిటిక్స్ కు సంబందించిన సంచలన వార్తలు ప్రసారం చేయడంలో ముందు ఉంటుంది.
గత 'లవ్ స్టోరీ' సీజన్ 1 మాదిరిగానే ఈ షోకు కూడా నిగార్ జెడ్ ఖాన్ హోస్ట్గా వ్యవహరించనుంది. బాలీవుడ్కి సంబంధించిన ఎందరో ప్రముఖుల వ్యక్తిగత జీవిత విశేషాలు ఈ షోతో వెలుగు చూడనున్నాయి అని టాక్. అంతేకాదు. ఈ సెకండ్ సీజన్తో చాలా మంది బాలీవుడ్ సినీ ప్రముఖుల పర్సనల్ లైఫ్ బట్టబయలు కానుందని ఈ కార్యక్రమ హోస్ట్ నిగాఖాన్ చెబుతోంది.
ఈ షోను అనుసరిస్తూ త్వరలో మన తెలుగు బుల్లి తెర పై కూడ ఇటువంటి షోలు వచ్చినా ఆశ్చర్యం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: