టాలీవుడ్ దర్శకులలో సునీల్ కుమార్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 'సొంత ఊరు', 'గంగపుత్రులు' వంటి సినిమాలు తీసి అనేక అవార్డులు పొందిన సునీల్ కుమార్ రెడ్డి టాలీవుడ్ కు ఒక మంచి దర్శకుడిగా మారుతాడు అని అనుకున్నారు అంతా. అయితే ఇక మంచి సినిమాలతో లాభం లేదనుకుని ప్రస్తుతం యూత్ కు నచ్చుతున్న బూతు సినిమాల క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని కొన్నాళ్ళ క్రితం ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కధ’ సినిమాతో వచ్చి తన మొట్టమొదటి కమర్షియల్ సక్సస్ అందుకున్నాడు.  ఈ బూతు కంటెంట్ తనకు కలిసి వచ్చిందన్న ఆలోచనతో ఈ బూతు డోసును మరింత పెంచి ‘ఒక క్రిమినల్ ప్రేమ కధ’తో మొన్న శుక్రువారం జనం మధ్యకు వస్తే బూతు సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల వర్గం కూడా ఈ సినిమాను భరించలేక ధియేటర్ల నుంచి పారిపోతున్నారు. ఇది ఇలా ఉంటే సెన్సార్ వారు కూడ ఒప్పుకున్న కొన్ని బూతు సన్నివేశాలను ఈ సినిమా నుండి తీసివేసాము అని దర్శకుడు ప్రకటించడం ఆశ్చర్యంగా మారింది. అంతేకాదు ఫ్లాప్ టాక్ కు భయపడి తాను తీసిన సినిమాలోని బూతు సీన్స్ ను తానే సెన్సార్ చేసుకున్న సినిమాగా సునీల్ కుమార్ రెడ్డి లేటెస్ట్ సినిమా 'ఒక క్రిమినల్ ప్రేమ కథ' రికార్డు క్రియేట్ చేసింది అంటూ సెటైర్లు పడటమే కాకుండా టాలీవుడ్ లో మారుతి స్థానాన్ని సునీల్ కుమార్ రెడ్డి దాటిపోయాడు అంటూ ఫిలింనగర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: