టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు ఫ్యాక్షన్ కథలు అటకెక్కిన సమయంలో తనదైన కథనంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను పొందిన డైరెక్టర్ ఎవరంటే, కచ్ఛితంగా బోయపాటి శ్రీను అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఎనాడో వదిలేసిన పాత చింతాక కథలని, బోయపాటి ఇప్పటికీ వదలకుండా, వాటిని అందమైన గాజుసీసాలో చూపించి ప్రేక్షకుల మెప్పుని పొందుతున్నాడు. ఆ కోవలోకి వచ్చిన చిత్రాలే లెజెండ్, సింహా సక్సెస్ లు. ఇదిలా ఉంటే ఈ డైరెక్టర్ తాజాగా మెగా హీరోలని మెప్పించే పనిలో ఉన్నాడు. గతంలో రామ్ చరణ్ ని వదలకుండా కథను వినిపించి నిరాశ చెందాడు. ఇప్పుడు మరో మెగా హీరో అల్లుఅర్జున్ ని మాత్రం తన కథతో మెప్పించాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ త్వరలోనే రెడీ కాబోతుంది. అవును, వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ఓ సినిమా రాబోతుంది. ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అనంతరం, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ సినిమా ఉంటుందని చిత్ర వర్గాల్లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే బోయపాటి శ్రీను వినిపించిన కథలో కొన్ని మార్పులని అల్లుఅర్జున్ సూచించాడట. అంతే కాకుండా యాక్షన్ పేరుతో ఓవరాక్షన్ వంటి సీన్స్ ని పూర్తిగా దూరంగా ఉంచాలని కోరాడు. ఆ తరహా సీన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దని బోయపాటికి, అల్లుఅర్జున్ చాలా క్లారిటిగా చెప్పుకొచ్చాడు. దీంతో బోయపాటి, అల్లుఅర్జున్ కోసం ప్రత్యేకంగా సీన్స్ ని రాసుకునే పనిలో ఉన్నాడు. మొత్తానికి బోయపాటికి, మెగా హీరో భలే స్ట్రోక్ ఇచ్చాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: