ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ క్వీన్ మూవీ. క్వీన్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాండ్ సక్సెస్ ని సాధించిన క్వీన్ మూవీని నిర్మాత, నటుడు అయిన త్యాగరాజన్ రిమేక్ హక్కుల్ని భారీ మొత్తంలో చేజిక్కించుకున్నాడు. అయితే త్యాగరాజన్ కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. మూవీ రిమేక్ హక్కుల్ని తీసుకున్నాడు కాని, ఇందులో హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలో అస్సలు అర్ధం కావడం లేదు. చాలా మంది టాప్ హీరోయిన్స్ అడిగితే, వారు క్వీన్ రిమేక్ ఫిల్మ్ లో నటించటానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా క్వీన్ మూవీలో త్రిష నటిస్తుందనే వార్త హల్ చల్ చేస్తుంది. అయితే త్రిషతో ఇప్పటికీ చర్ఛలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఓ వైపు హీరోయిన్స్ తో టాక్స్ నడుస్తుండగా మరోవైపు సమంత ఇప్పుడు మళ్ళీ క్వీన్ మూవీపై మనస్సు పారేసుకుంది. అయితే అది మూవీలో యాక్ట్ చేయడం ఒకటైతే, మరొకటి తన రెమ్యునరేషన్ కి కొత్త తరహా బిజినెస్ పద్దతులను వెతకడం. సౌత్ లో భారీ బడ్జెట్ తో రిమేక్ చేయటానికి క్వీన్ మూవీ సిద్ధంగా ఉండటంతో, ఈ మూవీ రిలీజ్ తరువాత సక్సెస్ కూడ గ్యారెంటీ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే సమంత క్వీన్ మూవీలో నటిస్తే రెమ్యునరేషన్ తీసుకోనంటూ ముందుకు వచ్చింది. అలాగే ఇందులో ఉన్న లాజిక్ ని చెప్పుకొచ్చింది. నా రెమ్యునరేషన్ కి బదులు తెలంగాణలోని నైజాం ఏరియా రైట్స్ ని తనకి ఇవ్వవలసిందిగా నిర్మాతని కోరిందట. అందుకు నిర్మాత షాక్ అయినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. క్వీన్ మూవీ రిమేక్ అనంతరం ఈ మూవీ నైజాం రైట్స్ కోసం మూడు కోట్ల రూపాయలను పెట్టెందుకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధంగా ఉన్నారు. సమంతకి నైజాం రైట్స్ ఇస్తే, తన రెమ్యునరేషన్ లెక్క చూసుకుంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చినట్టే అని అంటున్నారు. సమంత అడిగిన ప్రపోజల్ కి నిర్మాత నో అని చెప్పటమే కాకుండా, తను నటించాల్సిన అవసరం లేదని కూడ గట్టిగా చెప్పినట్టు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కథనాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: