టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తండ్రి అయిన సందర్భంగా పుత్రోత్సాహంతో ఉంటున్నాడు. అలాగే తను నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ రభస మూవీకి సంబంధించిన షూటింగ్ కూడ పూర్తవడంతో కొంత విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎప్పుడో మూడు నెలల క్రితమే పూర్తి కావాల్సిన రభస మూవీ షూటింగ్ షెడ్యూల్స్ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకూ వచ్చింది. మొత్తానికి రభస మూవీ చివరి షాట్ అనంతరం, మూవీకి గుమ్మడికాయ కొట్టేశారు. అయితే ఈ మూవీ అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా మరో మూవీని చేయాలని మొదట అనుకున్నాడు. ఇప్పుడు అనుకోకుండా రభస మూవీ షూటింగ్ లేటుగా పూర్తవటంతో తను అనుకున్న ఫ్లానింగ్స్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాడు. ఎట్ ప్రెజెంట్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలని కోరుకుంటున్నారు. అందుకే భార్య,కొడుకుతో ఎన్టీఆర్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమయంలో కొంత కాలం పాటు మరో సినిమా అన్నది లేకుండా విశ్రాంతి తీసుకుంటాడట. అయితే ఎన్టీఆర్ చెబుతున్నదాన్ని బట్టి చూస్తుంటే తను తీసుకునే విశ్రాంతి దాదాపు రెండు నెలల వరకూ ఉండవచ్చని అంటున్నారు. అప్పటి వరకూ కొత్త మూవీ స్టార్ట్ చేయకపోతే ఎలా అన్నది ఎన్టీఆర్ అప్ మూవీ రైటర్స్ వాదన. ఎన్టీఆర్ కి ఇప్పటికే స్టోరి, సీన్స్ చెప్పిన రైటర్స్ అందులోని మార్పులు కోసం యంగ్ టైగర్ ని సంప్రదించగా తను ఇప్పడల్లా కాదు, మరో నెల రోజుల వరకూ ఆగండి అంటూ చెప్పాడంట. దీంతో రైటర్స్ కి ఏం చేయాలో అర్ధం కావడం లేదని టాలీవుడ్ అంటుంది. ఓ ప్రముఖ లీడింగ్ టెలివిజన్ నిన్న ఈ కథనాన్ని ప్రచురించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: