టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా ఉంటున్న మెగా హీరో రామ్ చరణ్, తన అప్ కమింగ్ మూవీ గోవిందుడు అందరివాడేలే మూవీపై ప్రత్యేక శ్రద్ధని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన సీన్స్ మేకింగ్ విషయంలో డైరెక్టర్ కి ప్రీడం లేకుండా పోయిందనేది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పొల్లాచ్చిలో మొదలైంది. లీడ్ రోల్స్ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోవచ్చని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. ఆ తర్వాత ఈ చిత్ర టీం మొత్తం లాంగ్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీలోని కొన్ని సీన్స్ కి సంబంధించిన స్క్రీన్ ప్లేని దర్శకుడు క్రిష్ణవంశీ మార్చుకున్నట్టుగా తెలిసింది. కథలో కొన్ని సీన్స్ చాలా వీక్ గా ఉన్నాయని రామ్ చరణ్ నుండి ఒత్తిడి రావడంతో అలాగే మెగా క్యాంప్ నుండి దర్శకుడికి సలహాలు రావడంతో, డైరెక్టర్ మూవీలో కొద్దిపాటి మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుత సమయంలో క్రిష్ణవంశీకి చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ కాని, గ్రాండ్ సక్సెస్ ఫిల్మ్స్ కాని లేవు కాబట్టి, రామ్ చరణ్ మూవీకి మెగా క్యాంప్ నుండి ఎటువంటి మార్పులు, చేర్పులు వచ్చినా కాదనకుండా చేంజెస్ చేస్తున్నాడు. ఓ రకంగా క్రిష్ణవంశీ తన క్రియేటివిని పక్కన పెట్టి సాధారణ డైరెటక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది క్రిష్ణవంశీకి టార్ఛర్ లాగా ఉందని టాలీవుడ్ లో టాక్స్. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: