సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రేట్ యాక్టెర్ పేరు తెచ్చుకున్న యాక్టర్ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గత కొంత కాలంగా ప్రముఖ మూవీలలో హాట్ టాపిక్ గా ఉంటూ వివాదాలకు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కేవలం ఒకే ఒక్క మూవీలో నటిస్తున్నాడు. అది కూడ రామ్ చరణ్ నటిస్తున్న గోవిందుడు అందరివాడేలే మూవీలో. రామ్ చరణ్ నటిస్తున్న గోవిందుడు అందరివాడే మూవీలో ప్రకాష్ రాజ్ ని తీసుకోవడం వెనుక రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ధే అని టాలీవుడ్ అంటుంది. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ తాజాగా ఓ మూవీలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మూవీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో దండుపాళ్యం అంటూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సన్షేనల్ హిట్ ని సాధించిన మూవీ ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధం అవుతుంది. అయితే ఈ మూవీలో నటించటానికి దాదాపు ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. దండుపాళ్యం మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ రాజ్ గతంలోప్రకాష్ రాజ్ ని దండుపాళ్యం మూవీలో నటించాల్సిందిగా కోరాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ చాలా బిజిగా ఉండటం వల్ల ఈ మూవీకి ఆసక్తి చూపించలేదు. దాంతో ప్రకాష్ రాజ్ స్థానంలో డైరెక్టర్ రఘు ముఖర్జీని తీసుకున్నాడు. అలాగే ఫిమేల్ యాక్టర్ గా పూజా గాంధీని తీసుకున్నాడు. మూవీ రిలీజ్ అనంతరం దండుపాళ్యం మూవీలో కోలీవుడ్ లో సన్షేనల్ సక్సెస్ ని సాధించింది. తరువాత తెలుగులోకి డబ్ అయి ఇక్కడ కూడ ఫ్రాఫిట్ కలెక్షన్స్ ని సాధించుకోగలిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ శ్రీనివాస్ రాజ్, ఈ మూవీ సీక్వెల్ ని భారీగా ఫ్లాన్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు బాలీవుడ్ యాక్టర్స్ ని సీక్వెల్ లోకి తీసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకేసారి తమిళ్, తెలుగు, హిందీ బాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయటానికి భారీ ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ పూర్తి ఫెర్ఫార్మెన్స్ చేయగల చిత్రం దండుపాళ్యం2 అని అంటున్నారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ నటించి తిరిగి భారీ అవకాశాలని పొందుతాడని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: