టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంత రెమ్యునరేషన్ కి సంబంధించిన కొన్ని నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇంతకాలం సమంత అల్లుడు శ్రీను మూవీలో హీరోయిన్ గా నటించినందుకు తన రెమ్యునరేషన్ దాదాపు కోటి రూపాయల నుండి రెండు కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అందరూ గెస్సింగ్స్ చేస్తున్నారు. కాని తాజాగా అల్లుడు శ్రీను మూవీ రిలీజ్ అనంతం తన రెమ్యునరేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. సమంత నటించిన అల్లుడు శ్రీను మూవీలో హీరోగా బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ నటించాడు. కొడుకు డెబ్యూ మూవీ కావడంతో భారీ నిర్మాత అయిన సురేష్ కూడ, మూవీని భారీగా నిర్మించాడు. అయితే ప్రస్తుతం వస్తున్న టాక్ ప్రకారం మూవీకి పెట్టిన పెట్టుబడిలో దాదాపు నలభై శాతం వరకూ నిర్మాత నష్టపోవల్సి వస్తుందని ట్రేడ్స్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించినందుకు నిర్మాత క్యాష్ రూపంలో ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదు. తనకున్న గెస్ట్ హౌస్ బిల్డింగ్స్ లో ఒకదాన్ని సమంతకి రాసి ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఆ గెస్ట్ హౌస్ ఖరీదు దాదాపు 5 కోట్ల రూపాయల ఖరీదు ఉంటుందని తాజా అంచనా. దీంతో అల్లుడు శ్రీను మూవీలో సమంత నటించినందుకు తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపు 5 కోట్ల రూపాయలతో సమానం. ఇంత పెద్ద మొత్తాన్ని సమంత కి రెమ్యునరేషన్ కింద ఏ విధమైన లెక్కలు వేసుకొని నిర్మాత ఇచ్చినట్టో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. మొత్తానికి సమంత మాత్రం అల్లుడు శ్రీను మూవీలో నటించినందుకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే తన కెరీర్ లో ఇంత భారీగా రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే మొదటిసారి అంట.

మరింత సమాచారం తెలుసుకోండి: