సినిమా ప్రారంభం అయ్యాక ఆ సినిమాలోని సన్నివేసాల పై రూమర్లు రావడం సహజం. అయితే ఇంకా క్లాప్ కూడ కొట్టని రామ్ చరణ్ సినిమా పై ఒక విచిత్రమైన రూమర్ ఫిలింనగర్లో హడావిడి చేస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘ఆగడు’ తీస్తున్న శ్రీనువైట్ల ఆ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ తో ఒక సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే.  గతంలో చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవి ‘మరణమృదంగం’ ఛాయలు ఈ సినిమాలో ఉంటాయి అని అంటున్నారు. ఈ సినిమాలో ‘ఎవడు’ కాంబినేషన్ తో హిట్ కొట్టిన చరణ్ శ్రుతిహాసన్ ల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని ఫిలింనగర్ టాక్.  ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాలో నటిస్తున్న చరణ్ శ్రుతిల మధ్య ఒక ఘాటైన లిప్ లాక్ సీన్ ఉండబోతోంది అనే ప్రచారం ఫిలింనగర్లో వినపడుతోంది. ఇప్పటికే శ్రీనువైట్ల ఈ లిప్ లాక్ సీన్ గురించి ఆలోచన చేయడమే కాకుండా ఈ విషయం చరణ్ కు కూడ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ధియేటర్లలో ఈ సినిమాను చూసే చెర్రీ అభిమానుల ఆనందానికి అవధులు ఉండక పోవచ్చు. ఇప్పటిదాకా మాస్ హీరో పాత్రలు చేసిన చరణ్ యూత్ ఫాలోయింగ్ మరింత పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేసాడు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: