విలక్షణ నటుడు మోహన్ బాబుకు ఆదిలాబాద్ జిల్లా బాసరలో పాఠశాల పెట్టాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు. సరస్వతీ అమ్మవారి క్షేత్రం బాసరలో మోహన్ బాబు ఈ కోర్కెను బయట పెట్టడమే కాకుండా ఈ విషయమమై తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చర్చిస్తానని మోహన్ బాబు అన్నాడు. బాసర ఆలయంతో తనకు పాతికేళ్ల అనుబంధం ఉందని తన అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ కుటుంబ సమేతంగా తరుచూ అమ్మవారి దర్శనానికి రావడం తనకు అలవాటు అని అన్నాడు ఈ కలెక్షన్ కింగ్. తన మనవరాళ్లు హీరో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాలకు అక్షరాభ్యాసం నిమిత్తం నిన్న కుటుంబ సమేతంగా బాసర వచ్చి మోహన్ బాబు సరస్వతీదేవి ఆలయంలో అక్షరభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాడు.  మోహన్ బాబుకు ఆలయ కమిటీ స్వాగతం పలకడమే కాకుండా ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందచేసారు. మోహన్ బాబును చూడగానే పలువురు అభిమానులు ఆయన చుట్టూ చేరడమే కాకుండా మోహన్ బాబుతో మంచు కుటుంబంతో చాలామంది ఫోటోలు కూడ తీయించుకున్నారని సమాచారం. తిరుపతిలో శ్రీవిద్యానికేతాన్ ద్వారా ఎందరో పేద పిల్లలను చదివిస్తున్న మోహన్ బాబు బాసరలో కూడ ఒక మంచి విద్యాలయాన్ని స్థాపించి తెలంగాణ బిడ్డలకు విద్యాదానం చేస్తాడు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: