మరో అనువాద సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లిక్ పేరుతో బాలీవుడ్ లో నిర్మించిన సినిమా ఆరోజు పేరుతో తెలుగులో విడుదల కానుంది. ‘ ఏం జరిగింది?’ అనేది ఉప శీర్షిక. ఈ గ్లామర్ ఓరియంటెడ్ హారర్ చిత్రాన్ని నివేద స్టూడియో ఫిలిం కంపెనీ సమర్పణలో అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ‘ఆ రోజు’ సినిమాకు సంగీత్ శివన్ దర్శకత్వం వహించడంతో పాటు, ఫోటోగ్రఫీ బాద్యతలను నిర్వహించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘సదా, స్నేహా ఉల్లాల్, రియా సేన్ ల గ్లామర్ తో పాటు సినిమాలోని హారర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టకుంటుందని’ తెలిపారు. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైన ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: