నందమూరి బాలకృష్ణ సినిమాలలో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలు ఎటువంటి బ్లాక్ బస్టర్స్ గా మిగిలాయో అందరికి తెలిసిన విషయమే. బాలకృష్ణతో మాత్రమే కాదు చిరంజీవితో ‘ఇంద్ర’, వెంకటేష్ తో ‘బొబ్బిలిరాజా’ మోహన్ బాబుతో ‘అసెంబ్లీ రౌడీ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా తెలుగు సినిమాను ఏలిన కీర్తి బి. గోపాల్ కు ఉంది. అయితే ‘ఇంద్రా’ సినిమా తర్వాత తన సినిమాల విషయంలో గోపాల్ జడ్జిమెంట్ దెబ్బతింది అని చెపుతారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి తెలుసుకోలేక బాలయ్యతో చేసిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, ఎన్టీఆర్ తో చేసిన అల్లరి రాముడు, నరసింహుడు, ప్రభాస్ తో చేసిన అడవి రాముడు అన్నీ ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఆమధ్య రామ్ తో ‘మస్కా’ చేసినా గోపాల్ కు కలిసి రాలేదు.  దీనితో ఒకప్పుడు టాలీవుడ్ ను దర్శకుడిగా ఏలిన గోపాల్ హవా మసక బారింది. ఈమధ్యన గోపిచంద్-నయనతారలతో ఓ సినిమా మొదలుపెట్టినా అది కూడా ఆగిపోయింది.దీనితో ఇక లాభం లేదు అనుకుని బాలకృష్ణ కోసం కధలు తయారు చేస్తూ వరుస పెట్టి బాలయ్యకు కధలు వినిపించే పని మొదలు పెట్టాడట గోపాల్.  ఈయన వినిపిస్తున్న కధలు ఏమీ నచ్చకపోయినా గోపాల్ తో ఉండే సాన్నిహిత్యం రీత్యా ఏమి చెప్పాలో తెలియక బాలకృష్ణ గోపాల్ పేరు చెప్పితే భయ పడిపోతున్నాడు అంటూ గోపాల్ పై సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: