డైలాగ్ కింగ్ గా టాలీవుడ్ సినిమా రంగంలో చాలాకాలంగా కొనసాగుతూ ఎన్నో సినిమాల విజయానికి తన నటన ద్వారానే కాకుండా తన కంచు కంఠం ద్వారా సహకరించిన సాయికుమార్ హవా ఇప్పుడు బుల్లితెర పై కుడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విలక్షణ నటుడి కన్ను నాగార్జున పై పడింది అనేవార్తలు వస్తున్నాయి . అక్కినేని కుటుంబ చిత్రం మనం విజయవంతం అవడంతో ఇప్పుడు టాలీవుడ్ లోని ప్రముఖ కుటుంబాల ద్రుష్టి ఫ్యామిలీ సినిమాలపై పడింది. ‘మనం’ విడుదల కావడానికి ముందే మంచు ఫ్యామిలీ అంతా కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ అంటూ హడావిడి చేసిన విషయం తెలిసిందే.  ఇక అదే రూట్ లో వెళ్ళడానికి దగ్గుబాటి ఫ్యామిలీ సిద్ధంగా ఉండి సరైన కధ వేటలో పడింది రామానాయుడు, రానా, చైతన్య, వెంకటేష్ కలిసి నటించడానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులో ‘మనం’ లాంటి ప్రయోగం చేయడానికి సాయికుమార్ కధల వేటలో పడ్డాడు అనే వార్తలు వస్తున్నాయి. సాయికుమార్ తండ్రి పిజె శర్మ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి డబ్బింగ్ ఆర్టిస్టు అన్న విషయం తెలిసిందే. అదేవిధంగా సాయికుమార్ తనయుడు ఆది యంగ్ హీరో గా ఇప్పటికే పేరు తెచ్చుకోవడంతో ఈ ముగ్గురూ కలిసి నటించబోయే ఒక ఫ్యామిలీ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళుతుందని వార్తలు వస్తున్నాయి. దీనితో సాయి కుమార్ చేస్తున్న ప్రయోగం నాగార్జున మనం అదృష్టానికి దరిదాపుకు తీసుకువెళుతుందో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: