టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ రుద్రమదేవి. తాగాజా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో అనుష్క ధరిస్తున్న 10 కేజీల బంగారం కనపడకుండా మిస్ అయింది. అయితే ఆ బంగారం దొంగతనం చేయబడింది అనే విషయం చిత్ర యూనిట్ కి తెలిసిపోయింది. ఇదంతా నానక్రామ్ గూడా లో వేసిన రుద్రమదేవి సెట్ లో జరిగింది. దొంగతనం జరిగిన దానిలో చాలా ఖరీదైన బంగారు, వెండి నగలు ఉన్నాయి. అయితే గుణశేఖర్ దీనిపై రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాడని విషయం తెలిసిందే. ఇప్పుడు రాయదుర్గం పోలీసుల ఇన్వెస్టిగేషణ్ లో ఒక పెద్ద క్లూని పట్టుకున్నారు. ప్రస్తుతం సమాచారం ప్రకారం రుద్రమదేవి సెట్లో మాయమైన సుమారు 10 కేజీల నగలు నాదెళ్ళ ఆంజనేయశెట్టి గోల్డ్ మేకర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయిన రవి సుబ్రహ్మణ్యం ఇంట్లో బయటపడ్డాయి. రవి చెబుతున్న సమాధానాం పోలీసులకి నమ్మటానికి వీలులేకుండా ఉంది. దాంతో మొదటి క్లూగా రవిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా రవితో మరొ ఇద్దరిని త్వరలోనే అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ కేసుకి సంబంధించిన మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి నీతాలుల్ల నగలను డిజైన్ చేసారు. ఏదేమైనా రియాలిటి కోసం ఈ తరహా బంగారు ఆభరణాలను సినిమాల కోసం వాడటం అనేది కూడ చాలా రిస్కే అని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: