గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాకు ఎదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం కోట్లల్లో విలువ చేసే రుద్రమదేవి బంగారు ఆభరణాలు చోరీ చేయబడ్డాయి అనే వార్తలు టాలీవుడ్ ను కుదిపేసాయి. ఇప్పటికీ ఈ నగల దొంగ తనం మిస్టరీ వీడక పోవడంతో రోజుకు ఒక వార్త ఈ నగలకు సంబంధించి మీడియాలో వినిపిస్తోంది.  ఈ వార్తలు ఇలా ఉండగా రుద్రమదేవి సెట్ లో నిన్న షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం నిన్న ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక స్టంట్ మెన్ కు ప్రమాదంలో గాయాలు తగిలాయని అతని బ్యాక్ బోన్ కు బాగా దెబ్బ తగలడంతో అతడిని నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పటల్ లో చేర్పించినట్లు టాక్. నిన్న ఈ సినిమా సెట్లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తూ ఉండగా రోప్ లూజ్ కావడంతో స్టంట్ మెన్ కు ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు. అయితే ఈ ప్రమాద విషయమై ఇప్పటి వరకు యూనిట్ నుండి అధికారిక సమాచారం లేకపోవడంతో ఇది ఎవరో కావాలని పుట్టించిన రూమర్ మాత్రమేనా లేదంటే నిజమా అన్న విషయం పై క్లారిటీ లేదు. ఏది ఎలా ఉన్నా ఎదో ఒక సమస్య ‘రుద్రమదేవి’ ని వెంటాడుతూనే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: