టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తున్న హీరోలలో మెగా హీరో అల్లుఅర్జున్ ఒకరు. అల్లుఅర్జన్ ఎంచుకుంటున్న కథల తీరే అందుకు కారణం అంటున్నారు. తన మూవీ అంటే నిర్మాతలకి ఫ్రాఫిట్ కంపల్సరీ అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లుఅర్జున్ కి సంబంధించిన ఓ కథనం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. అల్లుఅర్జున్ ఏదైన మూవీలో హీరోగా నటిస్తే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ ఇచ్చుకోవల్సి ఉంటుంది. అలాంటిది తను హీరోగా నటించకపోయినప్పటికీ, ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న రుద్రమదేవి మూవీలో తను ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది. మొదటగా ఈ మూవీలో మహేష్ బాబుని తీసుకోవాలని గుణశేఖర్ భావించగా, తరువాత మహేష్ బాబు కాల్షీట్స్ బిజిగా ఉండటంతో ఆ రోల్ కి అల్లుఅర్జున్ వచ్చాడు. అయితే అల్లుఅర్జున్ తో చర్చలు జరిపిన అనంతరం రుద్రమదేవి మూవీకి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకొనూ అంటూ గుణశేఖర్ ని ఈ మెగా హీరో మాట ఇచ్చాడంట. అందుకు ఒప్పకోని గుణశేఖర్ మూవీ రిలీజ్ అనంతరం సంతోషకరమైన రెమ్యునరేషన్ ని ఇస్తాను. ఫ్రీగా చేయించుకోవడం సరికాదు అని గుణశేఖర్ మెగాహీరో అల్లుఅర్జున్ తో చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గోనగన్నారెడ్డి పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అల్లుఅర్జున్ కెరీర్ లోనే రుద్రమదేవిలో చేసిన రోల్ చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. మొత్తానికి రెమ్యునరేషన్ లేకుండా నటించటానికి ముందుకొచ్చిన మెగా హీరోని నిర్మాతలందరూ తెగ మొచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: