పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. గోపాల గోపాల మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ 22 రోజుల పాటు తన కాల్షీట్స్ ని ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కాల్షీట్స్ కి సంబంధించిన చర్చ చిత్ర యూనిట్ లో హాట్ టాపిక్ గా వినబడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన ఓ ఇంటి సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ లో వెంకటేష్, పవన్ కళ్యాణ్ ల మధ్య కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అలాగే శ్రియ శరన్ మీద వచ్చే కొన్ని కీలక సన్నివేశాలనూ చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన కాల్షీట్స్ కొద్ది రోజుల్లో అయిపోతున్నాయి. కాల్షీట్స్ అనంతరం కూడ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని మరి కొన్ని రోజుల పాటు అంటే దాదాపు మరో 4 రోజులు పాటు కాల్షీట్స్ ఇవ్వాల్సిందిగా దర్శకుడు పవన్ కి సూచించాడట. అయితే అందుకు పవన్ కళ్యాణ్ సముఖతగా లేడని తెలుస్తుంది. దాంతో దర్శకుడు కిషోర్ పార్ధసాని ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకి చెప్పాడంట. అయితే నిర్మాత సురేష్ బాబు ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడతానని దర్శకుడితో చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒకసారి డేట్స్ ఇస్తే ఆ టైంలోనే షూటింగ్ చేసుకోవాలని చాలా స్ట్రిక్ట్ గా మెసేజ్ ఇస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: