కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించింది. చిరంజీవి ఫిల్మ్ కెరీర్ లో చెప్పుకొదగ్గ చిత్రాలు జగదేక వీరుడు అతిలోక సుందరి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ వ్యవహారం బయటకు వస్తుంది. జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీని అశ్వినీదత్ నిర్మించాడు. ఇప్పుడు అశ్వినీదత్ మళ్ళీ ఈ మూవీ సీక్వెల్ కి ప్లానింగ్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడ దాదాపు పూర్తికావచ్చిందనే టాక్స్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది. ఈ సీక్వెల్ లో మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా ఉండబోతున్నాడు. అలాగే హీరోయిన్ గా తమన్న ఉంటుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీలో చిరంజీవితో పాటు శ్రీదేవి పాత్ర కూడ చాలా ముఖ్యమయినది. చిరంజీవికి రోల్ కి పోటీ ఇచ్చిన పాత్ర శ్రీదేవిది. ఆ విధంగానే ప్రస్తుత రిమేక్ లోనూ రామ్ చరణ్ తో పాటు సమానంగా హీరోయిన్ పాత్ర ఉండాలని నిర్మాతలు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఓ పక్క తమన్నాని హీరోయిన్ గా తీసుకోవాలని చర్ఛలు సాగుతుంటే, మరొ వైపు సమంత పేరు కూడ తెరపైకి వస్తుంది. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని అశ్వనీదత్ ఆఫీస్ నుండి అందుతున్న సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరు ఉంటారన్నదానిపై కూడ చర్ఛలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: