టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటి వినిపిస్తుంది. తెరపైకి వెంకటేష్, నాగార్జున మల్టీస్టారర్ కాంబినేషన్ రాబోతుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఓ యువ దర్శకుడు ఇప్పటికే దీనికి సంబంధించిన కథని వెంకటేష్ కి, నాగార్జునకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రీసెంట్ గా వెంకటేష్ నటించిన ద్రుశ్యం మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ మూవీను సౌత్ ఫిల్మ్ స్టార్ట్స్ చాలా మంది చూశారు. చూసిన వారందరూ వెంకటేష్ నటన సూపర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అలాగే ఆ ద్రుశ్యం మూవీని అక్కినేని నాగార్జున సైతం చూశాడు. “దృశ్యం” సినిమా చూసి, నాగార్జున, వెంకటేష్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘దృశ్యం’ సినిమా చూసాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ముఖ్యంగా వెంకటేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగా నచ్చింది. వెంకీ ఒక స్టార్ అయినప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన పాత్రలో చాలా బాగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు’. ‘దృశ్యం సినిమాని బాగా హండిల్ చేసారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సి ఉందని’ నాగార్జున అన్నాడు. వెంటకేష్ పై నాగార్జున ఇంతటా పొడడటానికి కారణం వెనుక త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ ఓ మూవీ రాబోతుందని అంటున్నారు. ఇప్పటికే కథా చర్ఛలు దాదాపు ఫైనలైజ్ అయ్యాయని టాలీవుడ్ టాక్. వెంకటేష్, నాగార్జునలు ఇద్దరూ కలిసి మరోసారి కథా చర్ఛల్లో పాల్గొని, వారి కాల్షీట్స్ ని దర్శకుడిని ఇస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి దిల్ రాజు నిర్మాతగా ఉండబోతున్నారంటూ తెలుస్తుంది. దిల్ రాజు ఆఫీస్ నుండే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీకి సంబంధించిన చర్ఛలు బయటకు వచ్చాయని అంటున్నారు. మొత్తంగా వెంకటేష్, నాగార్జులు కలిసి మూవీ చేస్తారని ఇప్పటి వరకూ ఎవ్వరూ అనుకోలేదు. ఒక్కసారిగా ఈ విషయం తెరపైకి రావడంతో ఇద్దరి అభిమానులు ఆ ప్రాజెక్ట్ కోసం తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: