బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హాట్ పెయిర్ అలాగే అప్ కమింగ్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంట రణ్ భీర్ కపూర్, కత్రినా కైఫ్. వీరిద్దరూ కచ్ఛితంగా మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు సైతం గట్టి నమ్మకంతో ఉన్నారు.ఎందుకంటే రణ్ భీర్ కపూర్ సీరియస్ గా కత్రినాకైఫ్ తో ప్రేమాయణం నడపటమే కాకుండా వ్యక్తిగత జీవితంలోకి చొరబొడ్డాడనే టాక్స్ బలంగానే వచ్చాయి. ఆ సమయంలో కత్రినాకైఫ్ తో చాలా మంది బడా హీరోలు డిస్టెన్స్ ని మెయింటెన్ చేశారు. అంతే కాకుండా ఈ జంటని పట్టించుకోవడం మానేశారు. దాంతో వీరిద్దరూ ఎంచక్కా పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు. ఇదంత కొన్ని నెలల క్రితం వ్యవహారం. ఇప్పుడు సీన్ మారిందంటుంది బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బిటౌన్ లో తాజాగా కత్రినాకైఫ్, రణ్ భీర్ కపూర్ ల ప్రేమాయణంలో జరిగిన పెనుమార్పుల గురించి మాట్లాడుకుంటుంది. రణ్ భీర్ కపూర్, కత్రినాకైఫ్ ని పూర్తిగా వదిలేశాడని, వీరద్దరూ బ్రేక్ అప్ చెప్పుకున్నారనే టాక్స్ బిటౌన్ లో వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా వీరిద్దరూ ఏ మాత్రం మాట్లాడుకోవడం లేదంట. ఎప్పడూ ప్రవేట్ ఫంక్షన్స్ కి జంటగా అటెండ్ అయ్యే కత్రినా, రణ్ భీర్ లు రెండు నెలల నుండి ఎవరికి వారే సింగిల్ గా వెళుతున్నారు. ఓ క్లియర్ డెసిషన్ కి వచ్చిన తరువాతే వీరిద్దరూ స్నేహితులుగా ఉండిపోయాలని భావిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో మరో జంట బ్రేక్ అప్ చెప్పుకుందని అంటున్నారు. అయితే చివరిగా వీరిద్దరూ కలిసే చిత్రంగా జగ్గా జాసూస్ ఉండిపోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: